<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/r-suresh/author-17" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>R.Suresh - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/author/17/rss</link>
                <description>R.Suresh RSS Feed</description>
                
                            <item>
                <title>రాబోయే పండుగల దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి : సీపీ సాయిచైతన్య</title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">రాబోయే పండుగల నేపథ్యంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ పి.సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యూహాలతో పనిచేయాలని సూచించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలను అప్రమత్తంగా ఉంచడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు పి.శ్రీనివాస్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/cp-sai-chaitanya-is-responsible-for-the-control-of-crime/article-713"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/2bf3a363-18ac-4d13-b9b3-143f2a5fa646.png" alt=""></a><br /><p style="text-align:justify;">రాబోయే పండుగల నేపథ్యంలో నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ పి.సాయిచైతన్య అధికారులను ఆదేశించారు. బోధన్ డివిజన్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరాల కట్టడికి ప్రత్యేక వ్యూహాలతో పనిచేయాలని సూచించారు. పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలను అప్రమత్తంగా ఉంచడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి వంటి అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు పి.శ్రీనివాస్, గురునాయుడు, సీఐలు వెంకట నారాయణ, విజయ్ బాబు, కృష్ణ ఎస్సైలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/cp-sai-chaitanya-is-responsible-for-the-control-of-crime/article-713</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/cp-sai-chaitanya-is-responsible-for-the-control-of-crime/article-713</guid>
                <pubDate>Wed, 08 Jul 2026 23:39:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/2bf3a363-18ac-4d13-b9b3-143f2a5fa646.png"                         length="2273432"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్ జూనియర్ కళాశాలలో గెస్ట్ లెక్చరర్లను నియమించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్</title>
                                    <description><![CDATA[అధ్యాపకులు లేక అల్లాడుతున్న విద్యార్థులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/student-unions-demand-that-guest-lecturers-should-be-appointed-in/article-712"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/1783532184417.png" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫాకల్టీ అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ, బహుజన విద్యార్థి ఫోర్స్ (బీవీఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు వడ్ల సతీష్ చారి, సిరివెసు సంతోష్ మాట్లాడుతూ.. కళాశాలలో ఒకేషనల్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇంగ్లీష్, జనరల్ ఫౌండేషన్ కోర్స్ మరియు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సబ్జెక్టులు బోధించడానికి గత రెండు సంవత్సరాలుగా సంబంధిత అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ప్రైవేట్ కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులు చదవాలంటే రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు ఖర్చవుతుందని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల కాక మెమోలు, టీసీలు పొందడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కొన్ని జూనియర్ కళాశాలల్లో 100 మంది విద్యార్థులు కూడా లేకపోయినా అక్కడ అధ్యాపకులు ఉన్నారని, కానీ 345 మంది విద్యార్థులున్న బోధన్ కళాశాలలో అధ్యాపకులు లేకపోవడం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. వచ్చే వారం రోజుల్లోగా గెస్ట్ ఫాకల్టీని నియమించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్ల సతీష్ చారి, సిరివెసు సంతోష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-07/img_20260708_215822.jpg" alt="IMG_20260708_215822" width="1877" height="1014"></img></p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/student-unions-demand-that-guest-lecturers-should-be-appointed-in/article-712</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/student-unions-demand-that-guest-lecturers-should-be-appointed-in/article-712</guid>
                <pubDate>Wed, 08 Jul 2026 23:10:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/1783532184417.png"                         length="1633312"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కన్నీటి ఏడారిలో.. కైలాష్‌ కథ ముగిసె</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">కళ్లముందే పెరిగి పెద్దవాడైన కొడుకు.. ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి అండగా ఉంటాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగ్లోత్ కైలాష్‌.. ఇప్పుడు విగతజీవిగా మారాడు. అదీ మాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఎడారిలో శవమై తేలడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.</p>
<p dir="ltr"><span style="color:rgb(224,62,45);">​<strong>ఎడారిలో మౌన రోదన</strong></span></p>
<p dir="ltr" style="text-align:justify;">మార్చి 19.. ఆ రోజుతో కైలాష్‌ గొంతు తల్లిదండ్రులకు వినిపించలేదు. కొడుకు కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు నాలుగు నెలలుగా పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. కంటికి రెప్పలా పెంచుకున్న కైలాష్‌ కోసం వారు పడ్డ తపన ఆ దేవుడికి కూడా కనిపించలేదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అసలు నిజం తెలిసేసరికి వారి గుండెలు బద్దలయ్యాయి. కైలాష్‌ చనిపోవడమే కాకుండా, తోటి మనిషిని మనుషులు పశువుల్లా ఎడారి ఇసుకలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/the-story-of-kailash-ends-in-a-desert-of-tears/article-710"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/img_20260708_225552.png" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">కళ్లముందే పెరిగి పెద్దవాడైన కొడుకు.. ఉన్నత చదువులు చదివి, కుటుంబానికి అండగా ఉంటాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌ వెళ్లిన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగ్లోత్ కైలాష్‌.. ఇప్పుడు విగతజీవిగా మారాడు. అదీ మాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్న ఎడారిలో శవమై తేలడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.</p>
<p dir="ltr"><span style="color:rgb(224,62,45);">​<strong>ఎడారిలో మౌన రోదన</strong></span></p>
<p dir="ltr" style="text-align:justify;">మార్చి 19.. ఆ రోజుతో కైలాష్‌ గొంతు తల్లిదండ్రులకు వినిపించలేదు. కొడుకు కనిపించడం లేదని ఆ తల్లిదండ్రులు నాలుగు నెలలుగా పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. కంటికి రెప్పలా పెంచుకున్న కైలాష్‌ కోసం వారు పడ్డ తపన ఆ దేవుడికి కూడా కనిపించలేదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అసలు నిజం తెలిసేసరికి వారి గుండెలు బద్దలయ్యాయి. కైలాష్‌ చనిపోవడమే కాకుండా, తోటి మనిషిని మనుషులు పశువుల్లా ఎడారి ఇసుకలో పాతిపెట్టారన్న వార్త మానవత్వాన్ని మంటగలిపింది.</p>
<p dir="ltr"><span style="color:rgb(224,62,45);">​<strong>తోటివాడే కాలమయ్యాడు</strong></span></p>
<p dir="ltr" style="text-align:justify;">నిజానికి, కైలాష్‌కు తోడుగా ఉంటాడనుకున్న నిందితుడు కూడా అదే డిచ్‌పల్లి మండలం సాంపల్లికి చెందినవాడు. సొంత ప్రాంతం నుంచి వెళ్లిన వ్యక్తి, తోటివాడిని కాపాడాల్సింది పోయి.. ప్రాణం పోయాక ఆ శవాన్ని కూడా ఎడారిలో అనాథలా పాతిపెట్టడం దారుణం. భయం అన్న ముసుగులో చేసిన ఈ అమానుషం ఇప్పుడు రెండు తండాల్లో విషాదాన్ని నింపింది.</p>
<p dir="ltr"><span style="color:rgb(224,62,45);">​<strong>తీరని శూన్యం</strong></span></p>
<p dir="ltr" style="text-align:justify;">సివిల్ ఇంజినీరింగ్ చదివి, కుటుంబానికి కొండంత అండగా నిలవాల్సిన యువకుడు ఇలా మధ్యలోనే ప్రాణాలు కోల్పోవడం కోరట్‌పల్లి తండాను శోకసంద్రంలో ముంచేసింది. నిందితుడి తండ్రి స్వదేశానికి పారిపోయి వచ్చినా, కైలాష్‌ మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. కొడుకు తిరిగి వస్తాడన్న ఆశతో ఉన్న తల్లిదండ్రుల కళ్లలో నీళ్లు ఇప్పుడు ఆరని గాయాలయ్యాయి. ఈ దారుణానికి పాల్పడిన వారిపై చట్టం కఠినంగా స్పందించాలని, తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/the-story-of-kailash-ends-in-a-desert-of-tears/article-710</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/the-story-of-kailash-ends-in-a-desert-of-tears/article-710</guid>
                <pubDate>Wed, 08 Jul 2026 23:00:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/img_20260708_225552.png"                         length="1284313"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్‌లో ఘనంగా గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల వేడుకలు</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్ జిల్లా బోధన్<strong> </strong>పట్టణంలోని ఏకచక్ర నగర్‌లో గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ మంగళవారం ఘనంగా జరిగింది. కాలనీకి చెందిన మహిళలు, కులస్తులు డప్పు వాయిద్యాల నడుమ బోనాలను నెత్తిన ధరించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గటుమల్ సాగర్, వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, సంఘ సభ్యులు సుభాష్, దశరథ్, తానాజీ, సీతారాం, గణేష్, దీపక్, పవన్, బాపూజీ, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-07/img-20260707-wa0217.jpg" alt="IMG-20260707-WA0217" width="1200" height="739" /></p>
<p dir="ltr" style="text-align:justify;">  </p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/bonala-celebrations-of-the-gangaputra-maratha-community-in-bodh/article-708"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/img_20260707_181500.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్ జిల్లా బోధన్<strong> </strong>పట్టణంలోని ఏకచక్ర నగర్‌లో గంగపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ మంగళవారం ఘనంగా జరిగింది. కాలనీకి చెందిన మహిళలు, కులస్తులు డప్పు వాయిద్యాల నడుమ బోనాలను నెత్తిన ధరించి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు గటుమల్ సాగర్, వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, సంఘ సభ్యులు సుభాష్, దశరథ్, తానాజీ, సీతారాం, గణేష్, దీపక్, పవన్, బాపూజీ, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-07/img-20260707-wa0217.jpg" alt="IMG-20260707-WA0217" width="1600" height="739"></img></p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/bonala-celebrations-of-the-gangaputra-maratha-community-in-bodh/article-708</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/bonala-celebrations-of-the-gangaputra-maratha-community-in-bodh/article-708</guid>
                <pubDate>Tue, 07 Jul 2026 18:21:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/img_20260707_181500.jpg"                         length="2384769"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం : బోధన్ పట్టణ ఎస్సై హబీబ్</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">మన ఊరు - మన భద్రత – మన బాధ్యత’ అనే నినాదంతో పట్టణ ప్రజల్లో చైతన్యం నింపేందుకు బోధన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలోని రద్దీగా ఉండే పాత బస్టాండ్ ఆవరణలో ఎస్సై హబీబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న సాంకేతికతతో పాటు నేరస్తుల శైలి కూడా మారుతోందని, దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు, ముఖ్యంగా ఓటీపీ లను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. తెలియని వ్యక్తులు పంపే మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, ఆకర్షణీయమైన ఆఫర్ల లింకులను క్లిక్ చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఒకవేళ పొరపాటున ఆన్‌లైన్ మోసానికి గురైతే అధైర్యపడకుండా, వెంటనే జాతీయ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/6a4cdaaef4126/article-707"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/img_20260707_142906.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">మన ఊరు - మన భద్రత – మన బాధ్యత’ అనే నినాదంతో పట్టణ ప్రజల్లో చైతన్యం నింపేందుకు బోధన్ పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలోని రద్దీగా ఉండే పాత బస్టాండ్ ఆవరణలో ఎస్సై హబీబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న సాంకేతికతతో పాటు నేరస్తుల శైలి కూడా మారుతోందని, దీనిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హితవు పలికారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.... నేడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండటంతో సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు, ముఖ్యంగా ఓటీపీ లను ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. తెలియని వ్యక్తులు పంపే మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, ఆకర్షణీయమైన ఆఫర్ల లింకులను క్లిక్ చేయవద్దని ఆయన హెచ్చరించారు. ఒకవేళ పొరపాటున ఆన్‌లైన్ మోసానికి గురైతే అధైర్యపడకుండా, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ <strong>1930</strong>కు కాల్ చేసి వివరాలు నమోదు చేయాలని సూచించారు. దీనివల్ల బాధితుల సొమ్మును రికవరీ చేసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​అనంతరం ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై ఎస్సై హబీబ్ మాట్లాడుతూ... రోడ్డు భద్రత అనేది ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనదారులు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడటం, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటివి ప్రమాదకరమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు కట్టాల్సి రావడమే కాకుండా, ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తమ వెంట డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు, పోలీసు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/6a4cdaaef4126/article-707</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/6a4cdaaef4126/article-707</guid>
                <pubDate>Tue, 07 Jul 2026 17:21:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/img_20260707_142906.jpg"                         length="682242"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సర్కారీ బడుల్లో అందరికీ భోజనం.. </title>
                                    <description><![CDATA[<p style="text-align:justify;">ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు సుమారు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.</p><p style="text-align:justify;">కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ పథకం నిరుపేదల హక్కులను హరించేలా ఉందని భావిస్తూ, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం రాష్ట్రాల భిన్నాభిప్రాయాలను పట్టించుకోకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఉపాధి హామీ కూలీలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అనివార్య పరిస్థితుల్లో దీనిని రాష్ట్రంలో కూడా కొనసాగించాలని నిర్ణయించారు.</p><p style="text-align:justify;">వైద్య రంగంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ టిమ్స్ మరియు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం 6,278 పోస్టులను మంజూరు చేశారు. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/food-for-all-in-government-schools/article-706"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/whatsapp-image-2026-07-02-at-9.42.19-pm.jpeg" alt=""></a><br /><p style="text-align:justify;">ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు సుమారు 1.5 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.</p><p style="text-align:justify;">కేంద్రం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్‌జీ పథకం నిరుపేదల హక్కులను హరించేలా ఉందని భావిస్తూ, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం రాష్ట్రాల భిన్నాభిప్రాయాలను పట్టించుకోకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఉపాధి హామీ కూలీలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో అనివార్య పరిస్థితుల్లో దీనిని రాష్ట్రంలో కూడా కొనసాగించాలని నిర్ణయించారు.</p><p style="text-align:justify;">వైద్య రంగంలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ టిమ్స్ మరియు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం 6,278 పోస్టులను మంజూరు చేశారు. ఈ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడంతో పాటు, వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎల్‌ఓసీలు జారీ చేయాలని నిర్ణయించారు.</p><p style="text-align:justify;">హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్-1లో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రూ. 7,345 కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/food-for-all-in-government-schools/article-706</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/food-for-all-in-government-schools/article-706</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 23:28:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/whatsapp-image-2026-07-02-at-9.42.19-pm.jpeg"                         length="102008"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రెంజల్ కేజీబీవీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ</title>
                                    <description><![CDATA[<h5 style="text-align:justify;">నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని <span class="transliteration">గురువారం </span>జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను గమనించి, పరిసరాలను వెంటనే శుభ్రం చేయించాలని, ఆర్‌ఓ ప్లాంట్‌ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని, బయటి వ్యక్తుల రాకపై ఆంక్షలు విధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రవణ్, ఎంపీడీఓ కమలాకర్, స్పెషల్ ఆఫీసర్ శ్యామల పాల్గొన్నారు.</h5>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/collector-surprise-inspection-at-renjal-kgbv/article-705"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/gemini_generated_image_g3oj5ug3oj5ug3oj.png" alt=""></a><br /><h5 style="text-align:justify;">నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని <span class="transliteration">గురువారం </span>జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను గమనించి, పరిసరాలను వెంటనే శుభ్రం చేయించాలని, ఆర్‌ఓ ప్లాంట్‌ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని, బయటి వ్యక్తుల రాకపై ఆంక్షలు విధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రవణ్, ఎంపీడీఓ కమలాకర్, స్పెషల్ ఆఫీసర్ శ్యామల పాల్గొన్నారు.</h5>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/collector-surprise-inspection-at-renjal-kgbv/article-705</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/collector-surprise-inspection-at-renjal-kgbv/article-705</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 22:57:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/gemini_generated_image_g3oj5ug3oj5ug3oj.png"                         length="1999361"                         type="image/png"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నకిలీ అక్రెడిటేషన్‌ కార్డుపై పోలీసులకు డీపీఆర్‌ఓ ఫిర్యాదు</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్‌<strong> </strong>జిల్లాలో కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి పేరిట నకిలీ మీడియా అక్రెడిటేషన్‌ కార్డు చెలామణి అవుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నకిలీ కార్డును సృష్టించేందుకు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన నిజామాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్‌.పద్మశ్రీ జిల్లా పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు అక్రెడిటేషన్‌ కార్డును సమాచార పౌర సంబంధాల శాఖ నిజామాబాద్ జిల్లా కార్యాలయం నుంచి జారీ చేయలేదని డీపీఆర్‌ఓ పద్మశ్రీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసిన సదరు వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎవరైనా ఈ తరహాలో నకిలీ అక్రెడిటేషన్‌ కార్డులను తయారు చేసినా, లేదా వాటిని వినియోగించినా చట్టరీత్యా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/dpro-complaint-to-police-on-fake-accreditation-card/article-704"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-07/img_20260702_193105.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">నిజామాబాద్‌<strong> </strong>జిల్లాలో కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. వాట్సాప్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పి.శ్రీనివాస్‌ అనే వ్యక్తి పేరిట నకిలీ మీడియా అక్రెడిటేషన్‌ కార్డు చెలామణి అవుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నకిలీ కార్డును సృష్టించేందుకు జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. దీనిపై స్పందించిన నిజామాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్‌.పద్మశ్రీ జిల్లా పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు అక్రెడిటేషన్‌ కార్డును సమాచార పౌర సంబంధాల శాఖ నిజామాబాద్ జిల్లా కార్యాలయం నుంచి జారీ చేయలేదని డీపీఆర్‌ఓ పద్మశ్రీ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ కార్డును తయారు చేసిన సదరు వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఎవరైనా ఈ తరహాలో నకిలీ అక్రెడిటేషన్‌ కార్డులను తయారు చేసినా, లేదా వాటిని వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/dpro-complaint-to-police-on-fake-accreditation-card/article-704</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/dpro-complaint-to-police-on-fake-accreditation-card/article-704</guid>
                <pubDate>Thu, 02 Jul 2026 19:32:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-07/img_20260702_193105.jpg"                         length="277321"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పసికందు ప్రాణాల కోసం పోరాటం.. కాపాడండీ సార్</title>
                                    <description><![CDATA[చికిత్సకు రూ.20 లక్షలు అవసరం.. భద్రత కవరేజ్ రాదన్న అధికారులు]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/save-the-fight-for-the-babys-life-sir/article-682"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/whatsapp-image-2026-05-27-at-6.11.54-pm.jpeg" alt=""></a><br /><p class="PlaygroundEditorTheme__paragraph" style="text-align:justify;">శాంతిభద్రతలను కాపాడే విధుల్లో నిత్యం నిమగ్నమయ్యే ఒక పోలీస్ కానిస్టేబుల్.. నేడు తన 11 నెలల కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి దాతల సాయం కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు. తీవ్రమైన బ్లడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కాలేయం, కిడ్నీలు, మెదడు దెబ్బతిని <span class="transliteration">హైదరాబాద్</span> <span class="transliteration">లోని</span> కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడుతున్న తన చిన్నారి గంటా జష్విక్‌ను రక్షించుకోవడానికి ఆ తండ్రి పడుతున్న వేదన వర్ణనాతీతం.</p>
<p class="PlaygroundEditorTheme__paragraph" style="text-align:justify;">కానిస్టేబుల్ గంటా నరేష్ కుమారుడు జష్విక్ క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అత్యవసర చికిత్స నిమిత్తం వైద్యులు రూ.20 లక్షలు ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తూ ఈ చికిత్సకు భద్రత ఇన్సూరెన్స్ కవరేజ్ రాదని చెప్పడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఉన్నపళంగా అంత సొమ్ము సర్దడం సాధ్యం కాక, ఇప్పటివరకు దాచుకున్నదంతా హారతి కర్పూరంలా కరిగిపోవడంతో తక్షణ ఆర్థిక సాయం కోసం ఆ తండ్రి యావత్ సమాజాన్ని వేడుకుంటున్నారు. ఉదార హృదయులైన దాతలు స్పందించి ఆర్థికంగా అండగా నిలవాలని, తమ చిన్నారిని ప్రార్థనలతో, విరాళాలతో ఆదుకోవాలని కోరుతున్నారు. చిన్నారి జష్విక్ చికిత్స నిమిత్తం నేరుగా తండ్రి ఖాతాకే విరాళాలు పంపవచ్చు. <strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">ఫోన్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">పే</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold">, </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">గూగుల్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">పే</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">నెంబర్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong> 8008689977, 9505853446, <strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">ఎస్బిఐ</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">బ్యాంక్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">అకౌంట్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold transliteration">నెంబర్</strong></strong><strong><strong class="PlaygroundEditorTheme__textBold"> </strong></strong>39073968252 <span class="transliteration">ఐఎసిఎఫ్సి</span> <span class="transliteration">కోడె</span> <span class="transliteration">నెంబర్</span> : SBIN0020376.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/save-the-fight-for-the-babys-life-sir/article-682</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/save-the-fight-for-the-babys-life-sir/article-682</guid>
                <pubDate>Wed, 27 May 2026 22:16:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/whatsapp-image-2026-05-27-at-6.11.54-pm.jpeg"                         length="283234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అంతర్ జిల్లా ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాతో పాటు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న ఇద్దరు స్క్రాప్ వ్యాపారులను నిజామాబాద్​ జిల్లా రెంజల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్క్రాప్ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​పోలీసుల కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా, ఒక గన్నీ బ్యాగులో ట్రాన్స్‌ఫార్మర్ రాగి కాయిల్స్ లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని మెదక్ పట్టణానికి చెందిన వనం సాయిలు, జగన్నాధం సారయ్య అలియాస్ శ్రీనివాస్, ధన శ్రీ కిరణ్, బోధన్‌కు చెందిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/gang-of-thieves-of-inter-district-transformers-arrested/article-680"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/screenshot_2026-05-23-10-03-59-095_com.miui.mediaeditor.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాతో పాటు, దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న ఇద్దరు స్క్రాప్ వ్యాపారులను నిజామాబాద్​ జిల్లా రెంజల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు స్క్రాప్ వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి 80 కేజీల రాగి కాయిల్స్, 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​పోలీసుల కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం రెంజల్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకుని తనిఖీ చేయగా, ఒక గన్నీ బ్యాగులో ట్రాన్స్‌ఫార్మర్ రాగి కాయిల్స్ లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని మెదక్ పట్టణానికి చెందిన వనం సాయిలు, జగన్నాధం సారయ్య అలియాస్ శ్రీనివాస్, ధన శ్రీ కిరణ్, బోధన్‌కు చెందిన వనం పోశెట్టి, నారాయణఖేడ్‌కు చెందిన దాసరి పోచయ్యగా గుర్తించారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​వీరిని నిఘా నేత్రంతో విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. గత రెండేళ్లుగా ఈ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి వివిధ జిల్లాల్లో ఏకంగా 64 ట్రాన్స్‌ఫార్మర్లను పాడుచేసి వాటిలోని రాగి కాయిల్స్ దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్, బోధన్ రూరల్, బోధన్ టౌన్, వర్ని, కోటగిరి, నిజామాబాద్ రూరల్, మోపాల్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి ప్రాంతాల్లో 38 దొంగతనాలకు పాల్పడ్డారు. అలాగే కామారెడ్డి జిల్లా పరిధిలోని కామారెడ్డి, బాన్సువాడ, పిట్లం, మద్నూర్, భిక్నూర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పెద్ద కొడప్‌గల్ ప్రాంతాల్లో 20 ట్రాన్స్‌ఫార్మర్లను, మెదక్ జిల్లాలోని మెదక్ రూరల్, చేగుంట, వెల్దుర్తి ఏరియాలలో 4 దొంగతనాలను, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పరిధిలో 2 దొంగతనాలను చేసినట్లు నిర్ధారించారు. దొంగిలించిన రాగి సొత్తును బోధన్‌కు చెందిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, నిజామాబాద్‌కు చెందిన షేక్ మహబూబ్‌లతో పాటు మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప మాస్టర్ అలియాస్ గౌతమ్, తాయప్ప దంగల్ అనే స్క్రాప్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తేలింది. వీరిలో స్క్రాప్ కొనుగోలు చేసిన సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేక్ మహబూబ్‌లను పోలీసులు అరెస్ట్ చేయగా, మేడ్చల్ జిల్లాకు చెందిన మాలప్ప, తాయప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ భారీ అంతరజిల్లా దొంగతనాల ముఠా గుట్టురట్టు చేసిన బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్, బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి, సీసీఎస్ ఎస్ఐ విట్టల్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామ్, కానిస్టేబుళ్లు రవి, విశాల్, కృష్ణలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంస పత్రాలను అందజేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"><img src="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260523_1005411.jpg" alt="IMG_20260523_100541" width="2160" height="2160"></img></p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/gang-of-thieves-of-inter-district-transformers-arrested/article-680</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/gang-of-thieves-of-inter-district-transformers-arrested/article-680</guid>
                <pubDate>Sat, 23 May 2026 10:07:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/screenshot_2026-05-23-10-03-59-095_com.miui.mediaeditor.jpg"                         length="647064"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణపై సీపీ సమగ్ర సమీక్ష</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దుల్లో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా 24 గంటల పాటు పటిష్టమైన తనిఖీలు చేపట్టాలని, ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బోధన్ సబ్ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్నందున, అంతరాష్ట్ర సరిహద్దుల గుండా రాకపోకలు సాగించే అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పొరుగు రాష్ట్ర పోలీసులతో మెరుగైన సమన్వయం సాధించడం ద్వారా నేరస్థుల కదలికలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ముఖ్యంగా హత్యలు, చోరీలు, సైబర్ మోసాలు, మహిళలపై జరిగే నేరాలతో పాటు డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/cp-comprehensive-review-of-crime-control-in-bodh-division/article-679"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img-20260522-wa0099.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">బోధన్ పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పురోగతిపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా సరిహద్దుల్లో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా 24 గంటల పాటు పటిష్టమైన తనిఖీలు చేపట్టాలని, ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బోధన్ సబ్ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉన్నందున, అంతరాష్ట్ర సరిహద్దుల గుండా రాకపోకలు సాగించే అనుమానాస్పద వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. పొరుగు రాష్ట్ర పోలీసులతో మెరుగైన సమన్వయం సాధించడం ద్వారా నేరస్థుల కదలికలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ముఖ్యంగా హత్యలు, చోరీలు, సైబర్ మోసాలు, మహిళలపై జరిగే నేరాలతో పాటు డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే పాత నేరస్థులు, రౌడీషీటర్లపై నిఘా పటిష్టం చేయడంతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి జనసంచారం ఉన్న ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై, అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​రోడ్డు ప్రమాదాల నివారణపై కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, జాతీయ, రాష్ట్ర రహదారులను కలిపే లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించడంతో పాటు, రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని సూచించారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత హైవే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాహన చోదకుల్లో మార్పు తెచ్చేందుకు ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో బాధితులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీటీసీ ఏసీపీ రాజశేఖర్, ప్రత్యేక విభాగాల ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/cp-comprehensive-review-of-crime-control-in-bodh-division/article-679</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/cp-comprehensive-review-of-crime-control-in-bodh-division/article-679</guid>
                <pubDate>Sat, 23 May 2026 09:56:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img-20260522-wa0099.jpg"                         length="611776"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీడీ కార్మికులకు ఆంక్షల్లేని పెన్షన్ ఇవ్వాలి</title>
                                    <description><![CDATA[<p dir="ltr" style="text-align:justify;">ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పథకం కింద నెలకు రూ.4,000 పింఛను వెంటనే మంజూరు చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంగడి బజారు నుంచి సమీకృత మండల కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు తక్షణమే నాలుగు వేల రూపాయల పింఛన్ అందించాలన్నారు. వచ్చే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని, ఈ ప్రక్రియలో కట్ ఆఫ్ డేట్ నిబంధనను పూర్తిగా తొలగించి కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ప్రభుత్వం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/beedi-workers-should-be-given-unrestricted-pension/article-678"><img src="https://www.dd9vaartha.com/media/400/2026-05/img_20260522_212706.jpg" alt=""></a><br /><p dir="ltr" style="text-align:justify;">ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన బీడీ కార్మికులందరికీ 'చేయూత' పథకం కింద నెలకు రూ.4,000 పింఛను వెంటనే మంజూరు చేయాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బీడీ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అంగడి బజారు నుంచి సమీకృత మండల కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి, అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు తక్షణమే నాలుగు వేల రూపాయల పింఛన్ అందించాలన్నారు. వచ్చే జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని, ఈ ప్రక్రియలో కట్ ఆఫ్ డేట్ నిబంధనను పూర్తిగా తొలగించి కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరారు.</p>
<p dir="ltr" style="text-align:justify;">​ప్రభుత్వం స్పందించని పక్షంలో బీడీ కార్మికులందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి అధికారికి అందజేశారు. అయితే, అధికారులు కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను స్వీకరించేందుకు నిరాకరించడంతో ఆగ్రహించిన కార్మికులు సమీకృత మండల భవన సముదాయంలోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ నాయకులు శోభ, బుజ్జి, లతా, శంకరమ్మ, లక్ష్మీ, గంగామణితో పాటు పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.</p>
<p dir="ltr" style="text-align:justify;"> </p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/beedi-workers-should-be-given-unrestricted-pension/article-678</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/beedi-workers-should-be-given-unrestricted-pension/article-678</guid>
                <pubDate>Sat, 23 May 2026 09:45:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2026-05/img_20260522_212706.jpg"                         length="661337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[R.Suresh]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        