<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.dd9vaartha.com/-draft---add-you-title/tag-180" rel="self" type="application/rss+xml" />
                <generator>DD9 Vaartha RSS Feed Generator</generator>
                <title>-draft--add-your-title - DD9 Vaartha</title>
                <link>https://www.dd9vaartha.com/tag/180/rss</link>
                <description>-draft--add-your-title RSS Feed</description>
                
                            <item>
                <title> కొంగాల జలపాతం వద్ద విషాదం.. సెల్ఫీ కోసం వెళ్లి యువకుడు గల్లంతు </title>
                                    <description><![CDATA[<p>ములుగు జిల్లా, వాజేడు సెప్టెంబర్ 21 (డిడి 9 వార్త): వాజేడు మండలంలోని ప్రసిద్ధ కొంగాల జలపాతం వద్ద ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన మహాశ్విన్ అనే యువకుడు సెల్ఫీ కోసం జలపాతం దగ్గరికి వెళ్లి జారి లోతులో పడిపోవడంతో మృతి చెందాడు.</p>
<p>స్నేహితులతో కలిసి పర్యటనకు వచ్చిన ఎనిమిది మంది ఉదయం అనుమతి లేకపోయినా జలపాతం వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో జలపాతం అంచున నిలబడి ఫోటోలు దిగుతుండగా, ఒక్కసారిగా కాలుజారి కింద పడిపోవడంతో మహాశ్విన్ ప్రాణాలు కోల్పోయాడు.</p>
<p>ఈ సంఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. మిగతా స్నేహితులు కేకలు వేస్తూ సహాయం కోసం ప్రయత్నించినా అప్పటికే ఆలస్యం అయింది. స్థానికులు, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.</p>
<p>అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా అనుమతి లేకుండా జలపాతాల వద్దకు వెళ్లడం, సెల్ఫీల కోసం ప్రాణాలను కోల్పోయిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.dd9vaartha.com/telangana/-draft--add-your-title/article-137"><img src="https://www.dd9vaartha.com/media/400/2025-09/img-20250921-wa0016.jpg" alt=""></a><br /><p>ములుగు జిల్లా, వాజేడు సెప్టెంబర్ 21 (డిడి 9 వార్త): వాజేడు మండలంలోని ప్రసిద్ధ కొంగాల జలపాతం వద్ద ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన మహాశ్విన్ అనే యువకుడు సెల్ఫీ కోసం జలపాతం దగ్గరికి వెళ్లి జారి లోతులో పడిపోవడంతో మృతి చెందాడు.</p>
<p>స్నేహితులతో కలిసి పర్యటనకు వచ్చిన ఎనిమిది మంది ఉదయం అనుమతి లేకపోయినా జలపాతం వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ క్రమంలో జలపాతం అంచున నిలబడి ఫోటోలు దిగుతుండగా, ఒక్కసారిగా కాలుజారి కింద పడిపోవడంతో మహాశ్విన్ ప్రాణాలు కోల్పోయాడు.</p>
<p>ఈ సంఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. మిగతా స్నేహితులు కేకలు వేస్తూ సహాయం కోసం ప్రయత్నించినా అప్పటికే ఆలస్యం అయింది. స్థానికులు, పోలీసుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.</p>
<p>అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా అనుమతి లేకుండా జలపాతాల వద్దకు వెళ్లడం, సెల్ఫీల కోసం ప్రాణాలను కోల్పోయిన సంఘటన తో విషాదఛాయలు నెలకొన్నాయి.</p>
<p>స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ – “ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తున్న యువత జాగ్రత్తలు మర్చిపోవడం ప్రాణాలకు ముప్పు అవుతోంది. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>Telangana</category>
                                    

                <link>https://www.dd9vaartha.com/telangana/-draft--add-your-title/article-137</link>
                <guid>https://www.dd9vaartha.com/telangana/-draft--add-your-title/article-137</guid>
                <pubDate>Sun, 21 Sep 2025 16:41:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.dd9vaartha.com/media/2025-09/img-20250921-wa0016.jpg"                         length="88333"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dd news]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        