నిమజ్జనోత్సవంలో హైడ్రా..!
On
హైదరాబాద్, సెప్టెంబర్ 06: నగరంలో శనివారం జరుగుతున్న గణపతి నిమజ్జనోత్సవంలో హైడ్రా భాగస్వామ్యం అయ్యింది. హుస్సేన్ సాగర్ వద్ద జరుగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు పర్యవేక్షించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించారు. నేరుగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. హైడ్రా అడిషనల్ కమిషనర్ శ్రీ ఎన్ అశోక్ కుమార్, హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య గారితో పాటు హైడ్రా DRF అధికారులు శ్రీ జయప్రకాష్, శ్రీ యజ్ఞ నారాయణ, శ్రీ గౌతం, మోహన్ తో పాటు DRF సిబ్బంది పాల్గొన్నారు. హుస్సేన్ సాగర్లో బోటులో తిరుగుతూ హైడ్రా సిబ్బంది గస్తీ కాస్తున్నారు.
Views: 18
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

