భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్ర ప్రదేశ్ గౌరవ పియుసి చైర్మన్ మరియు ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్.
On
భద్రాచలం, సెప్టెంబర్ 2 (డిడి9 వార్త) ఆంధ్ర ప్రదేశ్ గౌరవ పియుసి చైర్మన్ మరియు ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ కు ఆలయఅధికారులు అర్చకులు ఆలయమర్యాదలతో గౌరవంగా స్వాగతం పలికారు. తదుపరి సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ తాయారు అమ్మ వారి దేవాలయంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శాలువాతో సన్మానించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ చరిత్రను అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు.
Views: 23
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

