కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత
On
హైదరాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె, చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంలోనూ అంజలి ఘటించారు.
ఆమె మాట్లాడుతూ, "సామాజిక తెలంగాణ సాధన వరకు జాగృతి కార్యకర్తలు విశ్రాంతి తీసుకోరు. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కాళోజీ, ఐలమ్మల స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకాలు. ఆ స్ఫూర్తితోనే మేము పనిచేస్తున్నాం" అని పేర్కొన్నారు.
అదే విధంగా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే ఆ పదవికి మరింత గౌరవం తీసుకువస్తారని కవిత అభిప్రాయపడ్డారు.
Views: 5
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

