వేములవాడలో జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోకో – అరెస్టులో విద్యార్థి నాయకులు

వేములవాడలో జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోకో – అరెస్టులో విద్యార్థి నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అగ్రహారం ప్రాంతంలో జేఎన్టీయూ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రాస్తారోకో చేపట్టారు. ప్రస్తుతం తాత్కాలికంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్న తరగతుల గదులు, ప్రయోగశాలలు, మరుగుదొడ్లకు అధికారులు తాళాలు వేసినందుకు విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యమానికి ఏబీవీపీ, బీఆర్‌ఎస్‌వీ నాయకులు మద్దతు ప్రకటించారు.

రాస్తారోకో కారణంగా కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వేములవాడ సీఐ వీరప్రసాద్ పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులను సమాధానపరచడానికి ప్రయత్నించారు. కానీ వారు వెనక్కి తగ్గకపోవడంతో, విద్యార్థులు అలాగే ఏబీవీపీ, బీఆర్‌ఎస్‌వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ సమస్య సద్దుమణిగింది.

Views: 1

About The Author

Latest News

 కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్తాం: కవిత
హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, మాజీ సీఎం కేసీఆర్ అజెండాను ముందుకు తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కాళోజీ జయంతి...
భద్రాచలంలో అనుమతులు లేకుండా నడిపిన జీవధార ఎలక్ట్రో హెర్బల్ హాస్పిటల్ సీజ్.
2027లో భారీగా రానున్న క్రిష్ 4 – రాకేశ్ రోషన్ తాజా అప్‌డేట్
కన్నుల పండువగా రామయ్య నిత్య కళ్యాణం
లండన్‌లో 117 మంది సంగీతకారులతో ‘ఓజీ’ బీజీఎం – థమన్ ప్రత్యేక సర్ప్రైజ్
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు