ఇంటర్లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని
On
బీర్కూర్, ఏప్రిల్ 12(డిడి9 వార్త):
బీర్కూర్ గ్రామానికి చెందిన నిరడీ రవళిక ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ చాటింది. హైదరాబాద్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న ఆమె, BiPC గ్రూప్లో మొత్తం 1000 మార్కులకు గాను 970 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో విశిష్ట ఫలితాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో రవళిక స్టేట్ ర్యాంకర్గా నిలిచింది.రవళిక ఈ విజయంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఆమె తల్లిదండ్రులు నిరడీ శ్రీనివాస్, నిరడీ గంగామణి తమ కుమార్తె సాధించిన విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బంధుమిత్రులు, గ్రామస్థులు రవళికను అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
Views: 27
Tags:
About The Author
Related Posts
Latest News
18 Apr 2026 12:50:17
బీర్కూర్, ఏప్రిల్ 18(డిడి9 వార్త):
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బీర్కూర్ కమప్ప చౌరస్తాలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు...

