ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు

విద్యార్థులతో ట్రాఫిక్ ప్రతిజ్ఞ చేయించిన పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు

పాల్గొన్న రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మచ్చేందర్ రెడ్డి

రహదారి నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తామని, తోటి వారికి అవగాహన కల్పిస్తామని సాలూర విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్సై మాచందర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కలిసి "రహదారి నిబంధనలు పాటిస్తాం - ప్రమాదాలను నివారిస్తాం" అంటూ ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండటం వంటి అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

చిన్నతనం నుంచే ఇలాంటి సామాజిక స్పృహ కలిగి ఉండాలని, మీ ఇంట్లో పెద్దలకు కూడా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని సీఐ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మచ్చేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలుపాల్గొన్నారు.

WhatsApp Image 2026-04-15 at 12.23.30 PM

Views: 31
Tags:

About The Author

Latest News

హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు కీలకం: మియాపురం శశికాంత్ హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు కీలకం: మియాపురం శశికాంత్
బీర్కూర్, ఏప్రిల్ 18(డిడి9 వార్త): రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బీర్కూర్ కమప్ప చౌరస్తాలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు...
పేదల పెన్నిధి… ముఖ్యమంత్రి సహాయ నిధి
జిహాదీ మనస్తత్వంపై గర్జించిన ఆర్మూర్
సీపీఆర్‌తో ప్రాణాలను కాపాడవచ్చు: నిజామాబాద్ సీపీ సాయి చైతన్య
బీర్కూర్‌లో ఉచిత షుగర్ పరీక్షలు – ఇద్దరికి వైద్య చికిత్సకు రిఫర్
ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు