ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె

మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె

నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ సర్కిల్ కార్యాలయం ఎదుట డిచ్‌పల్లి, నిజామాబాద్ డివిజన్లతో పాటు ట్రాన్స్‌కోకు చెందిన వందలాది మంది ఆర్టిజన్ కార్మికులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు.

ఒకే సంస్థలో అందరికీ ఒకే నిబంధనలు వర్తింపజేయాలని, విద్యార్హతను బట్టి కన్వర్షన్ ప్రక్రియ చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేశారు. పీస్‌రేట్ వర్కర్లు, అన్‌మ్యాండ్ వర్కర్లు, మీటర్ రీడర్లను ఆర్టిజన్లుగా సంస్థలో విలీనం చేయాలని కోరారు. జీవో నంబర్ 11 ప్రకారం వారికి ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలతో పాటు కనీస వేతనాన్ని ప్రకటించాలని నినదించారు.

ఈ సమ్మె శిబిరాన్ని నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మరియు 1104 యూనియన్ డిస్కమ్ ప్రెసిడెంట్ రఘునందన్ సందర్శించి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల నుంచి సుమారు 500 మందికి పైగా కార్మిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు.WhatsApp Image 2026-04-14 at 7.12.34 PM

Views: 39
Tags:

About The Author

Latest News

ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన...
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు
ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
సేవా పథంలో లయన్స్ క్లబ్
తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు
బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
ఇంటర్‌లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని