ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త):
బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమం సర్పంచుల నిరసనతో ఒక్కసారిగా రగడకు దారి తీసింది.అధికారులు ప్రోటోకాల్ను పూర్తిగా పక్కనబెట్టి వ్యవహరించారని ఆరోపించిన సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను పట్టించుకోలేదని మండిపడుతూ వేదికపై కూర్చోకుండా క్రింద కూర్చొని నిరసనకు దిగారు. దీంతో సభా ప్రాంగణం ఉద్రిక్తంగా మారి, కొంతసేపు హంగామా చోటుచేసుకుంది.సర్పంచుల నిరసనతో కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనలో అధికారులు వెంటనే రంగంలోకి దిగి సర్పంచులతో చర్చలు ప్రారంభించారు. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదంపై హామీలు ఇచ్చిన అనంతరం పరిస్థితి కాస్త చల్లబడింది.అనంతరం కార్యక్రమం మళ్లీ ప్రారంభమైనప్పటికీ, ఈ ఘటన అధికార యంత్రాంగంపై ప్రశ్నలు లేవనెత్తింది. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

