పేదల పెన్నిధి… ముఖ్యమంత్రి సహాయ నిధి
బీర్కూర్, ఏప్రిల్ 18(డిడి9 వార్త)
రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేద ప్రజలకు ఆపన్నహస్తంగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గొండ్ల శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో శనివారం గ్రామానికి చెందిన లక్కపల్లి సత్యవ్వకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.31,000 చెక్కును ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేకమంది పేదలు వైద్య సహాయం పొందుతూ ఉపశమనం పొందుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు సహాయం అందుతోందని పేర్కొన్నారు.ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గాన్ని కన్నతల్లిలా భావిస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అలాగే నాయకుడిపై అనవసర విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోండ్ల రాజు, గ్రామ మాజీ సర్పంచ్ ఇందూర్ లక్ష్మన్, నాయకులు కాదేపురం గంగన్న, ఇందూర్ గజేందర్, కుమ్మరి గంగారాం, మేత్రి నాగుగొండ, గూడెం సాయిబాబు, సందుల రవి, లక్కపల్లి మొగులుగొండ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

