బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

బీర్కూర్, ఏప్రిల్ 13(డిడి9 వార్త):

బీర్కూర్ పోలీస్ స్టేషన్‌కు కొత్తగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన ఎస్‌.ఐ రాములు ని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.పోలీసు శాఖలో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.అలాగే ప్రాంతంలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగెళ్ళ సాయికిరణ్, మండల ఉపాధ్యక్షులు చేపూరి హనుమాన్లు, వడ్ల బసవరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు బీరుగొండ సాయిబాబా, పండరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 36
Tags:

About The Author

Related Posts

Latest News

ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన...
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు
ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
సేవా పథంలో లయన్స్ క్లబ్
తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు
బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
ఇంటర్‌లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని