30న బోధన్లో మహనీయుల జయంతి ఉత్సవాలు
By R.Suresh
On
ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్, న్యాయవాది నీరడి ఈశ్వర్ తెలిపారు. ఆదివారం బోధన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐదో ఏడాది ఉత్సవాలు
గత ఐదేళ్లుగా ఏప్రిల్ 30న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, డా.బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్, సంత్ సేవాలాల్ మహారాజ్ వంటి మహనీయుల జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి కోటేశ్వరరావు, కో-కన్వీనర్లు నీరడి రవి, మాచుకూరి దేవేందర్, సింగడే పాండు, సభ్యులు షేరే భీమ్ రావు, విట్టల్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు
Views: 46
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

