30న బోధన్లో మహనీయుల జయంతి ఉత్సవాలు
By R.Suresh
On
ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్, న్యాయవాది నీరడి ఈశ్వర్ తెలిపారు. ఆదివారం బోధన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐదో ఏడాది ఉత్సవాలు
గత ఐదేళ్లుగా ఏప్రిల్ 30న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, డా.బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్, సంత్ సేవాలాల్ మహారాజ్ వంటి మహనీయుల జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి కోటేశ్వరరావు, కో-కన్వీనర్లు నీరడి రవి, మాచుకూరి దేవేందర్, సింగడే పాండు, సభ్యులు షేరే భీమ్ రావు, విట్టల్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు
Views: 39
Tags:
About The Author
Latest News
16 Apr 2026 12:37:56
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త):
బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన...

