30న బోధన్‌లో మహనీయుల జయంతి ఉత్సవాలు

30న బోధన్‌లో మహనీయుల జయంతి ఉత్సవాలు

ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కమిటీ కన్వీనర్, న్యాయవాది నీరడి ఈశ్వర్ తెలిపారు. ఆదివారం బోధన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోధన్ పట్టణం    అంబేద్కర్ చౌరస్తాలో ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఐదో ఏడాది ఉత్సవాలు

గత ఐదేళ్లుగా ఏప్రిల్ 30న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే, డా.బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్, సంత్ సేవాలాల్ మహారాజ్ వంటి మహనీయుల జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈశ్వర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు పరిమి కోటేశ్వరరావు, కో-కన్వీనర్లు నీరడి రవి, మాచుకూరి దేవేందర్, సింగడే పాండు, సభ్యులు షేరే భీమ్ రావు, విట్టల్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

Views: 39
Tags:

About The Author

Latest News

ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన...
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు
ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
సేవా పథంలో లయన్స్ క్లబ్
తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు
బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
ఇంటర్‌లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని