రైల్వే బాధితులకు 'ఇందిరమ్మ' ఇళ్లు ఇవ్వాలి
ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్
By R.Suresh
On
నిజామాబాద్ - పెద్దపల్లి రైల్వే లైన్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఓడ్యాట్పల్లి గ్రామంలో బాధితులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
పదేళ్లుగా తీరని వేదన..
ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం రైల్వే పట్టాల నిర్మాణం వల్ల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన సుమారు 20 కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీరికి ఊరి చివరన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, అధికారులు, పాలకులు కాలయాపన చేసి చివరకు వాటిని రద్దు చేయడం దారుణమన్నారు. ప్రస్తుతం మరో రైల్వే లైన్ పనులు ప్రారంభమవుతుండటంతో, మరో 15 ఎస్సీ కుటుంబాల ఇళ్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు పట్టించుకోరా?
సొంత గూడు కోల్పోయిన బాధితులు అద్దె ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై స్థానిక ఎంపీని, ఆర్మూర్ ఎమ్మెల్యేను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని గంగాధర్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
Views: 45
Tags:
About The Author
Latest News
20 Apr 2026 14:37:34
బీర్కూర్, ఏప్రిల్ 20(డిడి9 వార్త):
బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామానికి గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు ఉపసర్పంచి కుమ్మరి అజయ్,వార్డు...

