భైరాపూర్ గ్రామంలో నెలరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచివేత – ప్రజావాణిలో ఫిర్యాదు

బీర్కూర్, ఏప్రిల్ 20(డిడి9 వార్త):

బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామానికి గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు ఉపసర్పంచి కుమ్మరి అజయ్,వార్డు మెంబర్ సాయాగౌడ్,రాములు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పలుమార్లు మిషన్ భగీరథ అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేసవి తీవ్రత పెరిగి ఎండలు మండుతున్న తరుణంలో, కనీస అవసరాలకు కూడా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.ప్రస్తుతం పరిస్థితి దారుణంగా మారిందని, తాగునీటి కోసం ఇతర గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భైరాపూర్ గ్రామానికి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Views: 224
Tags:

About The Author

Related Posts

Latest News

భైరాపూర్ గ్రామంలో నెలరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచివేత – ప్రజావాణిలో ఫిర్యాదు భైరాపూర్ గ్రామంలో నెలరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు నిలిచివేత – ప్రజావాణిలో ఫిర్యాదు
బీర్కూర్, ఏప్రిల్ 20(డిడి9 వార్త): బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామానికి గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు ఉపసర్పంచి కుమ్మరి అజయ్,వార్డు...
ఘనంగా బీర్కూర్‌లో మహాత్మా బసవేశ్వర 895వ జయంతి వేడుకలు.
వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి క్రీడా సామగ్రి పంపిణీ
సాలూరలో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
కాంటాలు లేక రైతుల ఆందోళన… సొసైటీకి తాళం వేసి నిరసన
తెలంగాణ మోటార్ రివైండింగ్ ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పై బీజేపీ నిరసన