వాజేడు మండలం లో రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్న బైక్… యువకుని కి గాయాలు.

వాజేడు మండలం లో రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లా, వాజేడు సెప్టెంబర్ 8 ( డిడి 9 వార్త) జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వాజేడు మండలంలోని టేకులగూడెం పంచాయతీ పరిధిలోని పావురాల వాగు వద్ద జాతీయ రహదారి-163పై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
చండ్రుపట్ల గ్రామానికి చెందిన పాయల రాంబాబు  ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఢీకొన్న దాటికి రాంబాబు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన అతడిని తొలుత ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు కొంత పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు తరలించినట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించి పేరూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Views: 4

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు