వాజేడు మండలం లో రోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్న బైక్… యువకుని కి గాయాలు.

వాజేడు మండలం లో రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లా, వాజేడు సెప్టెంబర్ 8 ( డిడి 9 వార్త) జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. వాజేడు మండలంలోని టేకులగూడెం పంచాయతీ పరిధిలోని పావురాల వాగు వద్ద జాతీయ రహదారి-163పై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
చండ్రుపట్ల గ్రామానికి చెందిన పాయల రాంబాబు  ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నాడు. ఢీకొన్న దాటికి రాంబాబు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన అతడిని తొలుత ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు కొంత పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌కు తరలించినట్లు సమాచారం.
ప్రమాదానికి సంబంధించి పేరూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Views: 1

About The Author

Latest News

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన రీతూ – పవన్ కళ్యాణ్‌తో మొదటి రోజే రొమాన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత తొమ్మిదో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోకు ఎప్పటిలాగే...
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సెన్సార్ పూర్తిచేసుకున్న తేజా సజ్జా ‘మిరాయ్’ – U/A సర్టిఫికేట్‌తో విడుదలకు సిద్ధం"
వేములవాడలో జేఎన్టీయూ విద్యార్థుల రాస్తారోకో – అరెస్టులో విద్యార్థి నాయకులు
10 మంది ఎమ్మెల్యేలు : అనర్హతా.? రాజీనామాలా.?
వాజేడు మండలం లో రోడ్డు ప్రమాదం
చిరంజీవి ఆశీర్వాదంతో నా సినీ ప్రయాణం ప్రారంభమైంది: తేజ సజ్జ