'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ

'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ

- ​తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 విజయం - 315వ ర్యాంక్

- ​ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన అల్లెపు మౌనికకు అరుదైన గౌరవం


​ములుగు సెప్టెంబర్ 27 (డిడి 9 వార్త): పట్టుదల ముందు పేదరికం అడ్డంకి కాదని ములుగు జిల్లాకు చెందిన యువతి నిరూపించింది. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించి, ఏకంగా డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా ఎంపికయ్యారు.
​మౌనిక తండ్రి సమ్మయ్య గ్రామంలో చిన్న టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో చదువుకున్న మౌనిక, తన తండ్రి ఆశయాలను నిజం చేస్తూ ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు.
​తాజాగా ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి 315వ ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంకుతో ఆమెకు డీఎస్పీ పోస్టు దక్కింది. టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడంపై మల్లంపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పడిన ఆమె కష్టాన్ని, పట్టుదలను పలువురు అభినందిస్తున్నారు.

Views: 21

About The Author

Related Posts

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం