'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ

'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ

- ​తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 విజయం - 315వ ర్యాంక్

- ​ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన అల్లెపు మౌనికకు అరుదైన గౌరవం


​ములుగు సెప్టెంబర్ 27 (డిడి 9 వార్త): పట్టుదల ముందు పేదరికం అడ్డంకి కాదని ములుగు జిల్లాకు చెందిన యువతి నిరూపించింది. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించి, ఏకంగా డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా ఎంపికయ్యారు.
​మౌనిక తండ్రి సమ్మయ్య గ్రామంలో చిన్న టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో చదువుకున్న మౌనిక, తన తండ్రి ఆశయాలను నిజం చేస్తూ ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు.
​తాజాగా ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి 315వ ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంకుతో ఆమెకు డీఎస్పీ పోస్టు దక్కింది. టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడంపై మల్లంపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పడిన ఆమె కష్టాన్ని, పట్టుదలను పలువురు అభినందిస్తున్నారు.

Views: 29

About The Author

Related Posts

Latest News

ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం ప్రజా పాలన సభలో హంగామా – సర్పంచుల నిరసనతో గందరగోళం
బీర్కూర్, ఏప్రిల్ 16 (డిడి9 వార్త): బీర్కూర్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సభ తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. మండల కార్యాలయ ఆవరణలో జరిగిన...
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి : బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు
ఏడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె
సేవా పథంలో లయన్స్ క్లబ్
తీర్మానం చేసి ఆరేళ్లు.. నిరుపేదలకు అందని ఇళ్ల స్థలాలు
బీర్కూర్ ఎస్సై రాములు ని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు
ఇంటర్‌లో సత్తా చాటిన బీర్కూర్ విద్యార్థిని