'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ

'టైర్ పంక్చర్' యజమాని కుమార్తె డీఎస్పీ

- ​తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1 విజయం - 315వ ర్యాంక్

- ​ములుగు జిల్లా మల్లంపల్లికి చెందిన అల్లెపు మౌనికకు అరుదైన గౌరవం


​ములుగు సెప్టెంబర్ 27 (డిడి 9 వార్త): పట్టుదల ముందు పేదరికం అడ్డంకి కాదని ములుగు జిల్లాకు చెందిన యువతి నిరూపించింది. మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన అల్లెపు మౌనిక తొలి ప్రయత్నంలోనే గ్రూప్-1లో విజయం సాధించి, ఏకంగా డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా ఎంపికయ్యారు.
​మౌనిక తండ్రి సమ్మయ్య గ్రామంలో చిన్న టైర్ పంక్చర్ షాపును నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతో చదువుకున్న మౌనిక, తన తండ్రి ఆశయాలను నిజం చేస్తూ ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు.
​తాజాగా ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో మౌనిక తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసి 315వ ర్యాంక్ సాధించారు. ఈ ర్యాంకుతో ఆమెకు డీఎస్పీ పోస్టు దక్కింది. టైర్ పంక్చర్ షాపు యజమాని కుమార్తె డీఎస్పీగా ఎంపిక కావడంపై మల్లంపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి పడిన ఆమె కష్టాన్ని, పట్టుదలను పలువురు అభినందిస్తున్నారు.

Views: 4

About The Author

Latest News

తప్పుడు ప్రకటన సమర్పణపై హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను తిరస్కరించిన ఎన్నికల సంఘం తప్పుడు ప్రకటన సమర్పణపై హైసీ నేత సల్మాన్ నామినేషన్‌ను తిరస్కరించిన ఎన్నికల సంఘం
హైదరాబాద్, అక్టోబర్ 22 (డిడి9 వార్త ): రాబోయే ఎన్నికల నేపథ్యంలో పెద్ద సంచలనం రేగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న హైసీ నేత...
భ‌ద్రాచ‌లం ద‌గ్గ‌ర ఏపీ, తెలంగాణ బోర్డ‌ర్‌లో టెన్ష‌న్
పోలీసుల ఎదుట లొంగిపోనున్న మావోయిస్ట్ కీలక అధినేత హిడ్మా?
BC DAY – బంద్ సంపూర్ణం.. స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, పార్టీలు.!
కాంగ్రెస్ నిజాయతీ లేకుండా బీసీలకు మోసం చేస్తోంది – ఈటల ఆగ్రహం
బీసీ బిల్లుకు ఆమోదం కోసం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో మోదీని కలవబోతున్నాం: మహేశ్ గౌడ్
ర్యాలీ మధ్యలో వి. హనుమంతరావు అకస్మాత్తుగా కిందపడి కలకలం