పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
బీర్కూర్, ఫిబ్రవరి 22 :
మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన చైనాపురం శాంతాబాయి – పీరాజీ పటేల్ దంపతులకు నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సహకారంతో గ్రామంలోని పేదలు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లకు పార్టీలకు అతీతంగా తమ సహకారం అందిస్తామని తెలిపారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని, గ్రామ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేపురం గంగన్న, కుమ్మరి గంగారాం, నాగుగొండ, చైనాపురం కామప్ప, హట్కరి దశరథ్, సాలె సాయిబాబు, సందుల రవి, క్యాదని లింగప్ప, నీరడి రాములు, బోయి సాయిలు, గైని నడిపి సాయిలు, పుల్కంటి శ్రీను, క్యాదెని లక్షప్ప తదితరులు పాల్గొన్నారు.

