కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ

భీమ్గల్ మండలంలోని కారేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ సామాజిక బాధ్యతలో భాగంగా పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా భీమ్గల్ జనసేన కోఆర్డినేటర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రేపటి తరానికి నాణ్యమైన విద్యను అందించడమే జనసేనాని ఆశయమని, ఆ లక్ష్య సాధన కోసమే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దామా నవీన్, రామావత్ తిరుపతి, గుగులోత్ ఓం శ్రీనివాస్, అనిల్ తో పాటు కారేపల్లి గ్రామస్థులు ప్రేమ్, రామ్, పరమేష్, సురేష్, నాగరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం