కారేపల్లి పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ
భీమ్గల్ మండలంలోని కారేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ సామాజిక బాధ్యతలో భాగంగా పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా భీమ్గల్ జనసేన కోఆర్డినేటర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రేపటి తరానికి నాణ్యమైన విద్యను అందించడమే జనసేనాని ఆశయమని, ఆ లక్ష్య సాధన కోసమే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దామా నవీన్, రామావత్ తిరుపతి, గుగులోత్ ఓం శ్రీనివాస్, అనిల్ తో పాటు కారేపల్లి గ్రామస్థులు ప్రేమ్, రామ్, పరమేష్, సురేష్, నాగరాజు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

