బోధన్ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
By R.Suresh
On
బోధన్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ వార్డు అభ్యర్థులు శనివారం కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో నూతన కౌన్సిలర్లచే ప్రమాణం చేయించారు. 33వ వార్డు కౌన్సిలర్గా గుత్తా అబ్బవ్వ, 29వ వార్డు కౌన్సిలర్గా రాజుల దేవి లక్ష్మీ పూజిత మరియు 11వ వార్డు కౌన్సిలర్గా కోలిపాక రేణుక పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ నూతన కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తమపై నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Views: 12
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

