పురాణే అజయ్ కుమార్ కు పంప మహాకవి పురస్కారం

పురాణే  అజయ్ కుమార్ కు  పంప మహాకవి పురస్కారం

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ రైటర్ ఫౌండేషన్, అభిజ్ఞ భారత్ ఆర్గనైజేషన్ మరియు సీత చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంపా సాహితి పీఠం అధ్యక్షులు పురాణి అజయ్ కుమార్  ప్రతిష్టాత్మకమైన పంప మహాకవి పురస్కారాన్ని అందజేశారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు, ప్రముఖ కవి డాక్టర్ మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయిత్రి శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి  కరకమల మీదుగా ఆయన ఈ సన్మానాన్ని, పురస్కారాన్ని అందుకున్నారు. మాతృభాషను గౌరవించుకుంటూ సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేయడం పట్ల నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, భాషాభిమానులు, సాహితివేత్తలు పాల్గొన్నారు.

Views: 4
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం