భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం

భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం

భీంగల్ పట్టణంలోని మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు శనివారం మున్సిపల్ చైర్‌పర్సన్ బొదిరే గంగామణి స్వామి, మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న పాలకవర్గానికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ గంగామణి స్వామి మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో సన్మానించిన మూడు గైండ్ల సంఘాల సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘాలకు సంబంధించిన ఆలయాల అభివృద్ధికి, ఇతర సమస్యల పరిష్కారానికి తమ పాలకవర్గం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పట్టణంలోని అన్ని వర్గాల సహకారంతో భీంగల్‌ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Views: 6
Tags:

About The Author

Latest News

వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వార్షిక పద్దుపై కసరత్తు.. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
తెలంగాణ రాష్ట్ర రాజకీయ, పరిపాలనా ముఖచిత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సచివాలయ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర...
బాన్సువాడలో ఉద్రిక్తతలకు చెక్ – 3 గంటల్లో పరిస్థితి అదుపులోకి, 19 మంది అరెస్ట్
దేవాదులకు సీఎం రేవంత్ 'జల' సిరి.. భూసేకరణకు రూ. 600 కోట్లు!
పేదల కల సాకారం — బరంగ్ ఏడ్గిలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం
చేతన్‌నగర్‌లో ఉచిత వైద్య శిబిరం
పోతంగల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సాజి పటేల్ ఏకగ్రీవం
భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం