భీంగల్ మున్సిపల్ పాలకవర్గానికి ఘన సన్మానం
By R.Suresh
On
భీంగల్ పట్టణంలోని మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు శనివారం మున్సిపల్ చైర్పర్సన్ బొదిరే గంగామణి స్వామి, మున్సిపల్ పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న పాలకవర్గానికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గంగామణి స్వామి మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో సన్మానించిన మూడు గైండ్ల సంఘాల సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంఘాలకు సంబంధించిన ఆలయాల అభివృద్ధికి, ఇతర సమస్యల పరిష్కారానికి తమ పాలకవర్గం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పట్టణంలోని అన్ని వర్గాల సహకారంతో భీంగల్ను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, మూడు గైండ్ల సంఘాల ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Views: 22
Tags:
About The Author
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

