ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ఓడిపోయామని మతిభ్రమించి మాట్లాడుతున్నారు

ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ఓడిపోయామని మతిభ్రమించి మాట్లాడుతున్నారు

 

అభివృద్ధిని మేము స్వాగతిస్తాం

– ప్రజలకు ఉపయోగం లేకుండా, ఆరోగ్యానికి హానికరంగా ఉన్న పనులను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాం

డీడీ9 కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారాలను తక్షణమే మానుకోవాలని, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌బాబుపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని బిఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్యతో పాటు వార్డు మెంబర్లు తీవ్రంగా ఖండించారు.

ఏటూరునాగారం గ్రామంలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు వచ్చినప్పుడు, వాటిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్ అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టం చేశారు. ఖలీల్ మెడికల్ స్టోర్ నుండి ఓడవాడ వరకు సీసీ రోడ్ల పనులు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే శాంక్షన్ అయ్యాయని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో టెండర్లు జరగలేదన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

సీసీ రోడ్లకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదని, అయితే డ్రైనేజీల నిర్మాణంలో ఉన్న లోపాలను మాత్రమే ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో నిర్మించిన అనేక డ్రైనేజీలు మురుగునీరు, చెత్తాచెదారంతో నిండిపోయి దోమలు పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితిని ప్రతిచోటా చూస్తున్నామని పేర్కొన్నారు. అందుకే డ్రైనేజీలోని నీటిని బయటకు ఎలా మళ్లిస్తారు? ప్రజల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతారు? అనే విషయాలపై స్పష్టమైన ప్రణాళికను కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వం ప్రజలకు చూపించాల్సిన బాధ్యత ఉందని డిమాండ్ చేశారు.

వర్కులు జరుగుతున్న ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి అడిగితేనే అసలు సమస్యలు తెలుస్తాయని తెలిపారు. ప్రతి గడప, ప్రతి ఇల్లు, ప్రతి వీధిని సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్‌బాబు ఆధ్వర్యంలో పరిశీలిస్తూ మానిటరింగ్ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయని చెప్పారు.

ప్రజల అవసరాలు, ప్రజల ఆరోగ్యం కాపాడడమే లక్ష్యంగా తమ సర్పంచ్ పనిచేస్తున్నారని, అభివృద్ధికి ఎప్పుడూ మద్దతే కానీ ప్రజలకు నష్టం కలిగించే పనులకు మాత్రం సహకరించబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌకబారు విమర్శలు మానుకుని, నిజంగా గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే పనులకు సహకరించాలని సూచించారు.

డ్రైనేజీల విషయంలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, జిల్లా కలెక్టర్‌తో కూడా చర్చించి, ప్రజలకు ఉపయోగపడే విధానాలపై సూచనలు మాత్రమే చేశామని, ఎలాంటి పనులను ఆపమని బెదిరింపులు చేయలేదని బిఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేయడం సరికాదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఏటూరునాగారం ఉపసర్పంచ్ పర్వతాల ఎల్లయ్య, వార్డు మెంబర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 11
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు