అమరవీరుల కుటుంబాలకు ‘వీర్’ కార్డులు
జిల్లాలో గతంలో నక్సలైట్ల కాల్పుల్లో వీరమరణం పొందిన 14 మంది పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు మంగళవారం 'తెలంగాణ వీర్ ఫ్యామిలీ కార్డుల'నుa పంపిణీ చేశారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య స్వయంగా అమరుల కుటుంబ సభ్యులకు ఈ ప్రత్యేక కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరమరణం పొందిన పోలీసుల సేవలు అమూల్యమైనవన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ 'టీజీ వీర్ ఫ్యామిలీ కార్డ్' ద్వారా అమరవీరుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు, ఇతర సదుపాయాలు మరింత సులువుగా అందుతాయని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

