#foundation-laying-of-100-feet-road-widening-works-at-boduppal
Telangana  హైదరాబాద్ 

బోడుప్పల్‌లో 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన

బోడుప్పల్‌లో 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన మేడ్చల్,అక్టోబర్ 28,(డిడి9 వార్త): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చిలకనగర్ నుండి బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు హెచ్‌ఎండిఏ నిధులతో రూ.10 కోట్లు వ్యయంతో చేపట్టిన 100 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు సోమవారం శంకుస్థాపన చేసారు మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ , బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ అజయ్ యాదవ్ మాట్లాడుతూ “ప్రజల సౌలభ్యం కోసం, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ చేపడుతున్నామని” అన్నారు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ “బోడుప్పల్ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాగానే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గి, ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి” అన్నారు. ఈ కార్యక్రమం లో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు సుమన్ నాయక్, బొమ్మక్ కళ్యాణ్, కొత్త చందర్ గౌడ్, పులకండ్ల జంగారెడ్డి, కృపాసాగర్, చీరాల నర్సింహా, కంటెస్టెడ్ కార్పొరేటర్ హరినాథ్ రెడ్డి, తోటకూర రాజు యాదవ్ తదితరులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Read More...