గోదావరిలోకి దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నం

గోదావరిలోకి దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్యాయత్నం

 

 కాపాడిన సిమ్మర్ ప్రసాద్

భద్రాచలం,మార్చి 28,(డిడి9 వార్త): భద్రాచలం గోదావరి వంతెనపై నుంచి ఒక వివాహిత తన 18 నెలల బిడ్డతో కలిసి గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది.

స్వరూప అనే మహిళ తన బిడ్డతో కలిసి వంతెనపై నుంచి నదిలోకి దూకినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు గజఈతగాళ్లకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఈతగాడు సిమ్మర్ ప్రసాద్ నీటిలో ఉన్న తల్లి–బిడ్డను గుర్తించి చాకచక్యంగా ఒడ్డుకు చేర్చాడు.

స్వరూప పాల్వంచ కలెక్టర్ కార్యాలయం సమీపంలో నివాసముంటున్నట్లు తెలిసింది. ఇటీవల ఆమె భర్త మృతి చెందినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తల్లి–బిడ్డలను వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

Views: 88
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు