శ్రీ వేద పాఠశాలలో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం విద్యార్థుల కోసం ఉచిత కంటి, దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్బో, బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 500 మంది విద్యార్థులకు వైద్యులు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ విద్యార్థులకు దృష్టి లోపాలను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. దంత వైద్యుడు ఇర్ఫాన్ అలీ విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి, నోటి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. శరీరంలో కళ్లు, పళ్లు అత్యంత కీలకమైన అవయవాలని, వీటిని సంరక్షించుకోవడంపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షులు తెల్ల రవికుమార్, పాఠశాల కరస్పాండెంట్ తెల్ల అక్షర, క్యాంప్ ఇంచార్జ్ హనుమంతరావు పటేల్, సభ్యులు కప్ప సంతోష్, కోయగూర శ్రీకాంత్, మోహన్ సెట్, వడ్ల ఉమాకాంత్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

