ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా పారిశుద్ధ్య పనులు
బీర్కూర్, జూన్ 17(డిడి9 వార్త):
బీర్కూర్ మండలం బరంగేడ్గి గ్రామంలో సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా మురికి కాలువల శుభ్రత పనులు చేపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడం, వర్షాకాలంలో నీటి నిల్వలు, దోమల వ్యాప్తిని నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పారిశుద్ధ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీల్లో ఉన్న మురికి కాలువలను పూర్తిగా శుభ్రం చేసి, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.గ్రామ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు లక్కపల్లి హనుమండ్లు, వడ్ల యాదవరావు, కారోబారి పర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

