బీర్కూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
బీర్కూర్, జనవరి 26(డిడి9 వార్త):
దేశం కోసం ప్రాణాలు అర్పించి భారతమాతను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ 77వ గణతంత్ర దినోత్సవాన్ని బీర్కూర్ మండలంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బీర్కూర్ మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు నాగేళ్ల సాయికిరణ్ మాట్లాడుతూ, స్వతంత్ర సమరయోధుల త్యాగాల వల్లే నేడు దేశం స్వేచ్ఛగా అభివృద్ధి పథంలో సాగుతోందని తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వడ్ల బసవరాజ్, పార్టీ సీనియర్ నాయకులు బీరుగొండ, మదారి శ్రీనివాస్, బీజేపీ నాయకులు పట్టపు గజేందర్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.

