ఆత్మ కమిటీ డైరెక్టర్ సందుల రవికి ఘన సన్మానం
బీర్కూర్, మే 31(డిడి9 వార్త): మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ డైరెక్టర్ సందుల రవికి శనివారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. నిగర్వి స్వభావంతో, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే సందుల రవికి ఇటీవల ఆత్మ కమిటీ డైరెక్టర్గా బాధ్యతలు దక్కిన సందర్భంగా ఈ సన్మానం చేపట్టారు.ఈ సందర్భంగా సందుల రవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఆత్మ కమిటీ డైరెక్టర్గా నియమించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్లకు కృతజ్ఞతలు తెలిపారు. బరంగ్ ఏడ్గి గ్రామ రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గోండ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కాదేపురం గంగన్న, హొక్నారి అశోక్, ఇందూర్ గజేందర్, బోయి లాలయ్య, కుమ్మరి గంగారాం, గాజుల పండరి, మేత్రి నాగుగొండ, ఫుల్కంటి హన్ముగొండ, నీరడి రాములు, జంగం బసలింగప్ప, హట్కారి దశరథ్, బోయి సాయిలు, గూడెం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

