హిందువులంతా ఏకతాటిపైకి రావాలి: సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పిలుపు

బోధన్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం

హిందువులంతా ఏకతాటిపైకి రావాలి: సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ పిలుపు

సనాతన హిందూ సంప్రదాయాలు, నైతిక విలువలను కాపాడుకుంటూ, మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీ ఉద్ఘాటించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధన్ పట్టణంలో శనివారం హిందూ సమ్మేళనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని బురుడు గల్లిలో గల విష్ణు మందిరం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక సమ్మేళనానికి కాలనీవాసులు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీతో పాటు గౌరవ అతిథులు కృష్ణ శాస్త్రి, విజయ భాస్కర్, మైస్కర్ సురేఖలు పాల్గొని ప్రసంగించారు. నేటి ఆధునిక కాలంలో హిందూ ధర్మ రక్షణ ఆవశ్యకతను వారు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే హిందూ సంప్రదాయాలను అలరింపజేయాలని, వారిలో దేశభక్తి, ధర్మనిష్ఠను పెంపొందించాలని కోరారు. సమాజ హితం కోసం హిందువులంతా ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధల నడుమ సాగిన ఈ సమ్మేళనంలో పట్టణ ప్రముఖులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

Views: 9
Tags:

About The Author

Latest News