జానకంపేట్ వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు
By R.Suresh
On
బక్రీద్ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ వద్ద పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ఎస్సై ముత్యాల రామ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని, రవాణాకు సంబంధించిన అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు వాహనదారులు సహకరించాలని కోరారు.
Views: 13
Tags:
About The Author
Latest News
31 May 2026 12:38:04
బీర్కూర్, మే 31(డిడి9 వార్త): మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ డైరెక్టర్ సందుల...

