చేపలు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి

పోతంగల్, ఫిబ్రవరి (డీడీ9 వార్త):
పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన శ్రీనివాస్ సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ క్రమంలో ఆదివారం పోతంగల్ గ్రామ చెరువులో శ్రీనివాస్ శవమై తేలినట్లు సమాచారం అందింది. ఈ వార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రాథమికంగా చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో జారి మునిగి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.శవానికి పంచనామ నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఎస్సై సునీల్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Views: 359
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు