బోధన్ గోశాలకు పశుగ్రాసం అందజేసిన బీర్కూర్ యువకులు
On
బీర్కూర్, మే 07(డిడి9 వార్త):
కొద్ది రోజుల క్రితం బోధన్లోని ఏక చక్రేశ్వర గోశాల లో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 15 వేల గడ్డి కట్టలు దగ్ధమైన విషయం తెలిసిందే.ఈ ఘటన గురించి గోసేవకుడు సితలే రమేష్ ద్వారా తెలుసుకున్న బీర్కూర్ గ్రామ యువకులు స్పందించి గోశాలకు పశుగ్రాసం సహాయం అందించారు.
బీర్కూర్ గ్రామానికి చెందిన గోసేవ దాతలు పిట్లం అశోక్ (బంగారం), శశికాంత్ కలిసి సుమారు రూ.25 వేల విలువైన 350 గడ్డి కట్టలను బోధన్ ఏక చక్రేశ్వర గోశాలకు పంపించారు.ఈ సేవా కార్యక్రమంలో గోసేవకులు సితలే రమేష్, శశికాంత్, కిట్టు, మెకానిక్ నాగు, శేఖర్, జూకంటి మల్లేష్తో పాటు గ్రామ యువకులు పాల్గొన్నారు. గోశాలకు అవసర సమయంలో సహాయం అందించిన దాతలను గోసేవకులు అభినందించారు.
Views: 117
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

