దామరంచ నూతన సర్పంచ్ బోయిని శంకర్కు ఘన సన్మానం
మియ్యాపురం శశికాంత్ ఆధ్వర్యంలో అభినందనలు
బాన్సువాడ, జనవరి 13(డిడి9 వార్త):
బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బోయిని శంకర్ ని మండల నాయకుడు మియ్యాపురం శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న సర్పంచ్ శంకర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.గ్రామానికి మరింత మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. నూతన సర్పంచ్ బోయిని శంకర్ గ్రామ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ దామరంచ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇంటెనుక శంకర్, వార్డు సభ్యులు కూర్మ లక్ష్మణ్, మంగలి అంబాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొని సర్పంచ్కు శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామంలో ఐక్యతతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

