దామరంచ నూతన సర్పంచ్ బోయిని శంకర్‌కు ఘన సన్మానం

మియ్యాపురం శశికాంత్ ఆధ్వర్యంలో అభినందనలు

బాన్సువాడ, జనవరి 13(డిడి9 వార్త):

బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బోయిని శంకర్ ని మండల నాయకుడు మియ్యాపురం శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న సర్పంచ్ శంకర్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు.గ్రామానికి మరింత మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పని చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. నూతన సర్పంచ్ బోయిని శంకర్ గ్రామ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ దామరంచ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇంటెనుక శంకర్, వార్డు సభ్యులు కూర్మ లక్ష్మణ్, మంగలి అంబాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొని సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామంలో ఐక్యతతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Views: 29
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు