గుమస్తా కాలనీలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన మహిళలు

కామారెడ్డి, జనవరి 13(డిడి9 వార్త) : కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.రోడ్ల ప్రారంభోత్సవం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ప్రకటిస్తూ భారీ ఎత్తున మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మహిళలకు షబ్బీర్ అలీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ,"ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మహిళల సాధికారత, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలే మా ప్రధాన బాధ్యత" అని అన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్,మండల అధ్యక్షులు గూడెం శ్రీనివాస్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు,గుడుగుల శ్రీనివాస్,పెద్ద సంఖ్యలో మహిళలు, వార్డు ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Views: 7
Tags:

About The Author

Related Posts

Latest News

సర్పంచ్‌కు ఘన సన్మానం సర్పంచ్‌కు ఘన సన్మానం
బీర్కూర్,జనవరి 15(డిడి9 వార్త) :  బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజకి యువకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా కిష్టాపూర్ ఉపసర్పంచ్...
వీరాపూర్‌లో లయన్స్ క్లబ్ సేవా హస్తం
విజేతలకు ట్రోఫీలు అందజేసిన మియ్యాపురం శశికాంత్
కామారెడ్డిలో కోయాల్కర్ కన్నయ్యా కుటుంబానికి షబ్బీర్ అలీ పరామర్శ
నెమ్లిలో గడ్డం విట్టల్ మాతృమూర్తి రుకవ్వకు నివాళులు – ₹5,000 ఆర్థిక సహాయం అందించిన గార్గే శ్రీనివాస్
బీర్కూర్‌లో భోగి సంబరాలు
గుమస్తా కాలనీలో నూతన సీసీ రోడ్ల ప్రారంభం