కామారెడ్డిలో కోయాల్కర్ కన్నయ్యా కుటుంబానికి షబ్బీర్ అలీ పరామర్శ
On
కామారెడ్డి,జనవరి 14(డిడి9 వార్త):
కామారెడ్డి పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కోయాల్కర్ కన్నయ్యా మాతృమూర్తి ఇటీవల పరమపదించిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సోమవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కన్నయ్యా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా నిలబడాలని మనోధైర్యం చెప్పి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Views: 17
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

