నెల రోజులుగా నీళ్లు బంద్‌.. పోచారం కాలనీవాసుల ధర్నా

నెల రోజులుగా నీళ్లు బంద్‌.. పోచారం కాలనీవాసుల ధర్నా

IMG-20260828-WA0012బాన్సువాడ, ఆగస్టు 28(డిడి9 వార్త): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు సంబంధిత అధికారుల,పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శుక్రవారం కాలనీవాసులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ..నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించి, క్రమం తప్పకుండా నీటి సరఫరా జరిగేలా అధికారులు,పాలకవర్గం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఉన్నారు.

Views: 175
Tags:

About The Author

Related Posts

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు