టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు

సాలూర చెకపోస్ట్ వద్ద 4 కేజీల గంజాయి పట్టివేత

టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు

టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని నిజామాబాద్ జిల్లా బోధన్ రూరల్ పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై ఓ వ్యక్తి బోధన్ పట్టణానికి గంజాయి సరఫరా చేసేందుకు వస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం అందింది. దీంతో రూరల్ సీఐ విజయ్ బాబు ఆదేశాల మేరకు ఎస్‌ఐ రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి సాలూర చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకాకు చెందిన లక్ష్మణ్ గంగగిరి (65) అనే వ్యక్తి అదుపులోకి తీసుకుని సోదా చేయగా 4 కేజీల గంజాయి లభించింది. గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

 

 

Views: 81
Tags:

About The Author

Latest News

బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది! బస్వాయిపల్లిలో విషాదం.. కట్టుకున్న ఇల్లే కడసారి నిలయమైంది!
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త): ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్‌...
వరుణ, సుదర్శన యాగాలు నిర్వహించిన ఎమ్మెల్యే పోచారం
అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
అక్రమ కట్టడాలను నిలిపివేయాలి
టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై గంజాయి రవాణా.. మహారాష్ట్ర వ్యక్తి అరెస్టు
బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు