బీర్కూర్ ఠాణాలో రక్షాబంధన్ వేడుకలు
On

బీర్కూర్, ఆగస్టు 28(డిడి9 వార్త): రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బీర్కూర్ పోలీస్ ఠాణాలో శుక్రవారం రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్స్ పోలీస్ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై వి.కే. రాములు, ఏఎస్సై అమృ, కానిస్టేబుల్స్ సంతోష్,శివకుమార్ లకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా పోలీసు సిబ్బంది పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.విధి నిర్వహణలో పోలీసుల మధ్య సోదరభావం, ఆత్మీయతను పెంపొందించేలా ఈ కార్యక్రమం కొనసాగింది.మహిళా కానిస్టేబుల్స్ రాఖీలు కట్టడంతో పోలీస్ ఠాణాలో పండుగ వాతావరణం నెలకొంది.
Views: 10
Tags:
About The Author
Related Posts
Latest News
30 Aug 2026 11:48:35
బాన్సువాడ, ఆగస్టు 29(డిడి9 వార్త):
ఇద్దరు చిన్నారులకు పక్కా ఇల్లు కట్టాలన్న ఓ కూలీ యువకుడి కల విషాదాంతమైంది.ఇంటి నిర్మాణం కోసం తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్...

