అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు రూ.2.50 లక్షల ఎల్ఓసీ మంజూరు
బాన్సువాడ, ఆగస్టు 29 (డిడి9 వార్త):
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్ గ్రామానికి చెందిన షేక్ ఫాతిమాబీ భర్త బాబుకు ఆపరేషన్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రూ.2.50 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరు చేయించారు.ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆపరేషన్కు ఆర్థిక సహాయం అవసరమని తెలుసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి, ఎల్ఓసీ అందేలా చర్యలు తీసుకున్నారు.దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.పేద ప్రజలకు అండగా నిలుస్తూ, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న పోచారం కుటుంబం తమకు ఆపదలో అండగా నిలిచిందని గ్రామస్థులు పేర్కొన్నారు.ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తమ కుటుంబం అండగా ఉంటుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారని అభిమానులు తెలిపారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

