ఆర్మూర్ లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
లయన్ నివేదన్ గుజరాతీకి రాఖీలు కట్టిన అక్కాచెల్లెళ్లు
ఆర్మూర్ పట్టణంలోని రామ్ భవన్లో రక్షాబంధన్ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. ప్రముఖ సామాజిక నాయకులు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ చార్టర్ ప్రెసిడెంట్, జీజీ ఫౌండేషన్ చైర్మన్ లయన్ నివేదన్ గుజరాతీకీ వారి అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వాదాలు అందించారు.
ఈ సందర్భంగా లయన్ నివేదన్ గుజరాతీ మాట్లాడుతూ... రాఖీ పౌర్ణమి అనేది అన్నాచెల్లెళ్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, మరియు పరస్పర రక్షణకు ప్రతీకగా నిలిచే అత్యంత పవిత్రమైన పండుగ అని కొనియాడారు. అన్నాచెల్లెళ్ల బంధం ఎంతో మధురమైనదని పేర్కొంటూ, "మీరు మాకు రక్ష.. మేము మీకు రక్ష.. మనమందరం కలిసి ఈ దేశానికి రక్ష" అనే గొప్ప సందేశాన్ని చాటారు. ఈ పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు ఆయన హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నివేదన్ గుజరాతీ కుటుంబ సభ్యులైన గుజరాతీ గీత, చవాన్ భావన, ఘటాడి నిర్మల, కొండల్వాడి మీరా బాయి, ప్రశాంతి, వినతి తదితరులు పాల్గొన్నారు..

