అధికార పార్టీ నుండి బి ఆర్ ఎస్ లోకి భారీగా వలసలు
అధికార పార్టీ నుండి బి ఆర్ ఎస్ లోకి భారీగా వలసలు
డిడి 9వార్త వెంకటాపురం
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయపడ్డారు గురువారం వెంకటాపురం మండల అధ్యక్షులు గంప రాంబాబు సీనియర్ నాయకులు గొడవర్తి నరసింహమూర్తి ఆదేశాల మేరకు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా రెపరెప లాడనుందని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయలేక కాంగ్రెస్ చతికల పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని నివేదికల ఆధారంగానే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనకాడుతుందని వి మర్శించారు., తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదేళ్లపాటు పాలించిన కేసీఆర్ నేతృత్వంలోని బి ఆర్ ఎస్ పాలన విలువ ప్రజలకు అర్థమైందని కేసీఆర్ తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ లోకి చేరిన వారిని సాధరంగా ఆహ్వానించారు

