ఏకచక్రపురం గోశాలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రూ.5,810 విరాళం
On
బాన్సువాడ,జనవరి 01(డిడి9 వార్త):
బోధన్ పట్టణంలో గల ఏకచక్రపురం గోశాలకు బీర్కూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సితలే రమేష్ తమ క్లినిక్లో ఏర్పాటు చేసిన గోమాత హుండీ ద్వారా సేకరించిన రూ.5,810లను ఈ రోజు గోశాల నిర్వహణ బృందానికి అందజేశారు.గోమాత సేవ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు, గోసేవకులు సితలే రమేష్, లయన్ మిత్రి కిరణ్, గోశాల సభ్యులు మనోజ్ పాల్గొని గోశాల సేవా కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేశారు.ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు లయన్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ,“ఏకఛక్రేశ్వర గోశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు… జై శ్రీరామ్… జై గోమాత” అని పేర్కొన్నారు.ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజలలో గోమాత సంరక్షణపై మరింత అవగాహన పెంపొందించిందని గోశాల సభ్యులు తెలిపారు.
Views: 21
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 23:48:46
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు....

