బీర్కూర్లో ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు
బాన్సువాడ, జూలై 25(డిడి9 వార్త):
ఏకలవ్య జయంతి సందర్భంగా బీర్కూర్ ప్రధాన కూడలి గాంధీ చౌక్లో శనివారం ఘనంగా నివాళులర్పించారు.ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జై ఏకలవ్య.. జై జై ఏకలవ్య అంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఏకలవ్య ఆదివాసీ, గిరిజన సమాజానికి ఆదర్శప్రాయుడని, గురుభక్తి, అంకితభావం, పట్టుదలకు ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.యువత ఏకలవ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్య, క్రీడలు, అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ
కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ యామ రాములు, ఉపసర్పంచ్ పరమేష్, యువజన నాయకులు మియాపురం శశికాంత్, ఆత్మ కమిటీ సభ్యులు శంకర్, నాయకులు బస్వరాజ్ పటేల్, మాజీ సర్పంచ్ సానెపు గంగారాం, మేకల విట్టల్, పృథ్వి గౌడ్, విజయ్, ఎరుకల సంఘ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

