ఎస్‌ఐఆర్‌పై నిర్వహించే గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రతి ఓటరు ఓటరు జాబితాను పరిశీలించి అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్

ఎస్‌ఐఆర్‌పై నిర్వహించే గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

IMG-20260826-WA0024కామారెడ్డి జిల్లా బ్యూరో, ఆగస్టు 26(డిడి9 వార్త): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో గురువారం, ఆగస్టు 27న గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా పూర్తి చేయడమే లక్ష్యంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.గ్రామ సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించడంతో పాటు, జాబితాలోని వివరాలను ప్రజలకు తెలియజేస్తారని తెలిపారు.మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారిన ఓటర్ల వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్ల వివరాలు, గైర్హాజరైన ఓటర్ల జాబితాలను కూడా గ్రామ సభల్లో చదివి వినిపిస్తారని తెలిపారు.ప్రతి ఓటరు, గ్రామ ప్రజలు తప్పనిసరిగా గ్రామ సభలకు హాజరై ఓటరు జాబితాను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. తమ పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా, పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.గ్రామ సభల్లో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), బూత్ స్థాయి అధికారుల పర్యవేక్షకులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితర అధికారులు పాల్గొంటారని తెలిపారు.నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ, అభ్యంతరాల నమోదు, పరిష్కార విధానం తదితర అంశాలపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నిర్వహించే గ్రామ సభలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితా సక్రమంగా ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హులు మరియు పునరావృత నమోదులను గుర్తించేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు.ఈ నేపథ్యంలో ఆగస్టు 27న నిర్వహించే గ్రామ సభలకు ప్రజలు తప్పనిసరిగా హాజరై ఓటరు జాబితాను పరిశీలించి తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Views: 74
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు