డిపోలో ఇఫ్తార్ విందు

బాన్సువాడ, మార్చి 13 (డిడి9 వార్త):
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపవాసం పాటిస్తున్న ముస్లింలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీఐ మంజుల, హెడ్ గార్డ్ రాజారామ్, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సలీం, కార్యదర్శి హఫీజ్, మజీద్, అలావుద్దీన్, సయ్యద్ ఇంతియాజ్, ఇర్ఫాన్, ఫాహీం, రిటైర్డ్ ఉద్యోగులు కౌసర్, మహిమూద్, అలాగే కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 27
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు