నిరుపేదలకు అండగా యువ నాయకుడు మియాపురం శశికాంత్

బీర్కూర్,జనవరి 08(డిడి9 వార్త):

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవాభావంతో ముందుకు సాగుతున్న యువ నాయకుడు మియాపురం శశికాంత్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.బీర్కూర్ గ్రామానికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన సయ్యద్ హుస్సేన్ ఇటీవల తన కూతురు వివాహాన్ని నిర్వహించారు. అయితే వివాహానికి కావలసిన ఖర్చుల కారణంగా ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం శశికాంత్ దృష్టికి వచ్చింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే స్పందించిన శశికాంత్ తన వ్యక్తిగత వంతుగా రూ. 6,100/- నగదు సహాయాన్ని అందజేసి, ఆ కుటుంబానికి భరోసాగా నిలిచారు.ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ "సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలి. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన సేవ" అని అన్నారు.శశికాంత్ చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు, గ్రామస్తులు అభినందిస్తూ, యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

Views: 85
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు