గర్భిణీ ఆరోగ్యమే బిడ్డకు భరోసా: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

బాన్సువాడ, జూలై 30(డిడి9 వార్త):

గర్భిణీ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బాన్సువాడలోని తన నివాసంలో కల్యాణలక్ష్మి, ష్యాది ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడం ప్రతి కుటుంబ సభ్యుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.గIMG20260730115201ర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.పుట్టిన వెంటనే శిశువుకు తొలి పాలు (ముర్రుపాలు) తప్పనిసరిగా ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు.తల్లి పాలలో శిశువు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు సమృద్ధిగా ఉంటాయని వివరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను కూడా చిన్నతనంలో మా తల్లి పాలను నాలుగేళ్ల పాటు తాగాను.అందువల్లే ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతి బిడ్డకు తల్లి పాలు అందితే వారు కూడా ఆరోగ్యంగా పెరుగుతారు అని పేర్కొన్నారు.ప్రతి కుటుంబం శుభ్రమైన, సురక్షితమైన తాగునీటినే వినియోగించాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక అంటువ్యాధులను నివారించవచ్చని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, లబ్ధిదారులు ఉన్నారు.

Views: 58
Tags:

About The Author

Related Posts

Latest News

ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఓటరు కార్డులో మార్పులా? ఈ 4 రోజుల్లో దరఖాస్తు చేసుకోండి: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా తెలిపారు....
గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాలు కీలకం
గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఫారిన్ కాంట్రిబ్యూషన్ కమిటీ సభ్యుడిగా ఎంపీ ధర్మపురి అర్వింద్
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
స్వలాభం కోసమే కవిత అసత్య ఆరోపణలు
అమరవీరుల కుటుంబాలకు ‘వీర్‌’ కార్డులు