బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, మార్చి 01(డిడి9 వార్త):

బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కళ్యాణలక్ష్మి, షాది ముభారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణం, బాన్సువాడ గ్రామీణ మండలం, నసురుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు చెందిన మొత్తం 178 మంది లబ్ధిదారులకు రూ.1,78,20,648/- విలువైన చెక్కులు అందజేశారు.మండలాల వారీగా చూస్తే బాన్సువాడ గ్రామీణ మండలానికి చెందిన 54 మందికి రూ.54,06,264/-, బాన్సువాడ పట్టణానికి చెందిన 30 మందికి రూ.30,03,480/-, నసురుల్లాబాద్ మండలానికి చెందిన 74 మందికి రూ.74,08,584/-, బీర్కూర్ మండలానికి చెందిన 20 మందికి రూ.20,02,320/- చొప్పున సహాయం అందింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల వివాహాల కోసం ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ఈ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Views: 45
Tags:

About The Author

Related Posts

Latest News

ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత ఒక్క చుక్క రక్తం… మరో ప్రాణానికి ఆశాకిరణం - సేవాభావంతో ముందుకు వచ్చిన యువత
బీర్కూర్, మార్చి 01(డిడి9 వార్త): లయన్స్ క్లబ్ అఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బీర్కూర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో నిర్వహించిన మహత్తర రక్తదాన శిబిరం ఘనవిజయం సాధించింది. సమాజ...
బాన్సువాడలో కళ్యాణలక్ష్మి–షాది ముభారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్లే పోచారం శ్రీనివాసరెడ్డి
ఆడబిడ్డలకు అండగా కల్యాణలక్ష్మి – కాంగ్రెస్ నాయకుల హామీ
తిరుమలపూర్‌లో ఉచిత వైద్య శిబిరం
లక్ష్యంతో చదివి.. ఉన్నతంగా ఎదగాలి : బోధన్ ఏసీపీ శ్రీనివాస్
భీమ్‌గల్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పసికందు హత్యపై రజక సంఘాల ఆగ్రహం